పాక్ తో చర్చలంటూ ఉంటే పీవోకే పైనే: రాజ్ నాథ్ సింగ్

పాక్ తో చర్చలంటూ ఉంటే పీవోకే పైనే: రాజ్ నాథ్ సింగ్

పాక్ తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని..ఒక వేళ చర్చలు జరిపినా పీవోకే గురించి మాత్రమే ఉంటాయని అన్నారు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్. హరియాణాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజ్ నాథ్ సింగ్..  పాక్ ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకునే వరకు చర్చలు జరపబోమన్నారు.  జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుపై  తమకు మద్దతు పలకాలని పాక్ ప్రపంచ దేశాలను కోరుతోందన్నారు. అసలు మనం ఏ తప్పు చేశామని భయపడాలన్నారు. ఈ విషయంలో అమెరికా పాక్ కు మొట్టికాయలు వేసిందన్నారు.