మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ : రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్

మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ : రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్

కూకట్​పల్లి, వెలుగు: ప్రధాని మోదీ కృషితో ప్రపంచంలో భారత్​ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందుతోందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్​ లక్ష్మణ్​ అన్నారు. కూకట్​పల్లి వివేకానందనగర్​కాలనీలో డివిజన్​ బీజేపీ అధ్యక్షుడు ఎన్​.వంశీరెడ్డి, హనుమాన్​ శక్తి కేంద్రం ఇన్​చార్జి  పి.నాగేందర్​రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మన్​కీ బాత్​ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆత్మ నిర్భర్​ భారత్​లో భాగంగా స్వదేశీ వస్తువులను వాడాలని కోరారు. ఇందుకు అనుగుణంగా భారత ప్రభుత్వం జీఎస్టీని కూడా తగ్గించిందని చెప్పారు. కూకట్​పల్లి నియోజకవర్గ బీజేపీ ఇన్​చార్జి మాధవరం కాంతారావు, సీనియర్​ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు, డాక్టర్​ కొరడాల నరేశ్​ పాల్గొన్నారు.