క్యాన్సర్ ని జయించిన వారే రియల్ హీరోలు: రకుల్ ప్రీత్

క్యాన్సర్ ని జయించిన వారే రియల్ హీరోలు: రకుల్ ప్రీత్

క్యాన్సర్ ని జయించి, ఉన్నత శిఖరాలకు చేరిన వారిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని సూచించింది టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి రచించిన.. నేను క్యాన్సర్ ని జయించాను అనే పుస్తకాన్ని రకుల్ ఆవిష్కరించింది. క్యాన్సర్ ని జయించిన వారే రియల్ హీరోలన్న ఆమె.. ఎన్నో ఇన్సిపిరేషన్ స్టోరీలకు వేదికైన బుక్ తన చేతుల మీదుగా ఆవిష్కరించడం అవ్వడం సంతోషంగా ఉందని చెప్పింది. ఇక.. తాను ఆపరేషన్ చేసిన వారిలో తనకు ఆదర్శంగా నిలిచిన 108 మంది పేషంట్ల విజయగాథల గురించి.. వాళ్ల లైఫ్ లో ఎదుర్కొన్న సమస్యల గురించి ఈ బుక్ లో క్లుప్తంగా రాశానని చెప్పారు డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి. బేగంపేట్ లోని ఐటీసీ కాకతీయ హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు, అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీత రెడ్డి, నావా హస్పిటల్స్ డాక్టర్ నవీన్ కుమార్ పాల్గొన్నారు.