విరాట్ కోహ్లీ బయోపిక్.. ఆయన కథలో అంత విషయం లేదు.

విరాట్ కోహ్లీ బయోపిక్.. ఆయన కథలో అంత విషయం లేదు.

విరాట్ కోహ్లీ బయోపిక్(Virat kohli biopic).. గత రెండు రోజులుగా ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan) విరాట్ కోహ్లీగా కనిపించనున్నాడు అనే ప్రచారం కూడా జరిగింది. ఓ బాలీవుడ్ బడా సంస్థ ఈ సినిమా చేయడం కోసం ప్రయత్నాలు చేస్తుందని, ఇందుకోసం మూడు వందల కోట్ల బడ్జెట్ పెడుతున్నారనే పెద్ద ప్రచారం జరిగింది. దీంతో ఈ ప్రాజెక్టు నిజమే అనుకోని సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వచ్చాయి.

ALSO READ :స్టార్ డైరెక్టర్ అట్లీ.. ఇక అల్లు అర్జున్ తో మూవీ షురూ? మరో హిట్ కన్ఫర్మ్! 

అయితే తాజాగా సమాచాం మేరకు ఈ వార్తల్లో నిజం లేదని, ఇదంతా ఉత్తుత్తి ప్రచారమే స్పష్టం అయ్యింది. నిజానికి విరాట్ కోహ్లీకి తన బయోపిక్ ను తెరపై చూసుకోవాలన్న సరదా ఇప్పట్లో లేదట. ఇదే విషయంపై తనను సంప్రదించిన నిర్మాతలకు కూడా నిర్మొహమాటంగా నో చెప్పేశాడట. పైగా కోహ్లీ జీవితంలో సినిమా తీయడానికి సరిపడా ఎమోషనల్ డ్రామా పెద్దగా లేదు. క్రికెటర్ అవడానికి చాలా కష్టపడ్డాడు కానీ.. సినిమాటిక్ గా ఆ కథ అంతగా వర్కౌట్ అవదు. అందుకే ఈ బయోపిక్ పై ఏ హీరో అభిమానులు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ గా లేరు.  

ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన దర్శకుడు శంకర్ తో గేమ్ ఛేంజర్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా తరువాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు రామ్ చరణ్. ఈ రెండు సినిమాలు పూర్తవడానికి కనీసం రెండేళ్ళైనా పడుతుంది. కాబట్టి రామ్ చరణ్ కోహ్లీ బయోపిక్ లో నటిస్తున్నారు అనడంలో ఎలాంటి వాస్తవం లేదు.