అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు దక్కించుకున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan). ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(The Oscar of motioan pictures arts and scinces) (ఆస్కార్ కమిటీ) తాజాగా ప్రకటించిన మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్ లిస్టులో రామ్ చరణ్కు చోటు దక్కింది. ఈమేరకు అధికారిక ప్రకటన చేసింది ఆస్కార్ కమిటీ. వెండితెరపై తమ ప్రతిభతో ఎంతోమందిని ఆకర్షించారు. అంకితభావంతో అద్భుతమైన హావభావాలను పలికించారు. నిజానికి, కల్పితానికి మధ్య వారధులుగా నిలిచారు. సినిమాల్లో ఎన్నో పాత్రలకు తమ నటనతో ప్రాణం పోశారు. అలాంటి ప్రతిభగలవారిని యాక్టర్స్ బ్రాంచ్లోకి గౌరవంగా ఆహ్వానిస్తున్నాం.. అంటూ పేర్కొన్నారు అకాడమీ ప్రతినిధులు.
Also Read : ఆడియన్స్ గెట్ రెడీ.. OTTలో ఒకేరోజు రెండు క్రేజీ సినిమాలు
ఇక టాలీవుడ్ నుండి రామ్ చరణ్ కు ఈ అరుదైన గౌరవం దక్కడంతో.. సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇటీవలే ఎన్టీఆర్ కూడా ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రామ్ చరణ్ కు కూడా ఆ గౌరవం దక్కింది.
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.