ISPL T20: క్రికెట్ టీమ్ కొనుగోలు చేసిన రామ్ చరణ్

ISPL T20:  క్రికెట్ టీమ్ కొనుగోలు చేసిన రామ్ చరణ్

హైదరాబాద్, వెలుగు : టాలీవుడ్ స్టార్ రామ్‌‌‌‌‌‌‌‌ చరణ్ తేజ్‌‌‌‌‌‌‌‌ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్‌‌‌‌‌‌‌‌పీఎల్‌‌‌‌‌‌‌‌)తో జట్టు కట్టాడు. లీగ్‌‌‌‌‌‌‌‌లో పోటీ పడే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ను చరణ్ సొంతం చేసుకున్నాడు.

ఇండియాలో జరిగే తొలి టెన్నిస్ బాల్ టీ20 లీగ్‌‌‌‌‌‌‌‌ ఆరంభ ఎడిషన్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌తో పాటు ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌‌‌‌‌‌‌‌కతా, శ్రీనగర్ జట్లు బరిలోకి దిగుతున్నాయి. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ఓనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తాను లీగ్‌‌‌‌‌‌‌‌లో భాగం అవుతున్నానని  చరణ్ ఆదివారం ఎక్స్‌‌‌‌‌‌‌‌ (ట్విట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)లో ప్రకటించాడు.  మార్చి 2 నుంచి 9 వరకు  ముంబైలో ఈ లీగ్ జరగనుంది.