ఆ వెలితిని రామబాణం తీరుస్తుంది : శ్రీవాస్

ఆ వెలితిని రామబాణం తీరుస్తుంది : శ్రీవాస్

గోపీచంద్, డింపుల్ హయతి జంటగా  శ్రీవాస్‌‌‌‌‌‌‌‌ రూపొందించిన చిత్రం ‘రామబాణం’. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ చిత్రం మే 5న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా శ్రీవాస్ మాట్లాడుతూ ‘గోపీచంద్, నేను కలిసి మళ్ళీ సినిమా చేయాలనుకున్నప్పుడు మంచి యాక్షన్ సినిమా ప్లాన్ చేశాం. అయితే  లక్ష్యం, లౌక్యం ఫ్యామిలీ ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌తో పాటు మాస్ క్లాస్ అందరూ లైక్ చేసిన కథలు. మా నుంచి మళ్లీ ప్రేక్షకులు అలాంటి సినిమానే కోరుకుంటారనిపించింది.

అన్నదమ్ముల అనుబంధం మీద ఓ కొత్త పాయింట్ చెప్పారు భూపతిరాజా. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్‌‌‌‌‌‌‌‌తో పాటు యాక్షన్ కూడా ఉండటంతో ఈ కథను సెలెక్ట్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నాం. కరోనా తర్వాత జనాల్లో ఫుడ్‌‌‌‌‌‌‌‌పై అవగాహన పెరిగింది. దాని రిలేటెడ్‌‌గా పెడితే ఇంకా కనెక్టింగ్‌‌‌‌‌‌‌‌గా ఉంటుందనిపించింది. అందుకే ఆర్గానిక్ ఫుడ్ పాయింట్ తీసుకుని కథకు ఎంత అవసరమో అంతే వాడాం.  కుష్బూ పాత్ర ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్. గోపీచంద్, కుష్బూ మధ్య వచ్చే సీన్స్ కంటతడి పెట్టిస్తాయి. ఫ్యామిలీ అంతా కూర్చుని చూసే సినిమా రావడం లేదనే వెలితి ఎప్పుడూ ఉంటుంది. ఆ వెలితిని రామబాణం తీరుస్తుంది.  ఆరు యాక్షన్ ఎపిసోడ్స్‌‌‌‌‌‌‌‌తో పాటు  ఫ్యామిలీ ఎమోషన్స్, సోషల్ అవేర్నెస్ ఉంది. ఇందులో ఏ ఒక్క పాయింట్ చేసినా అదొక సినిమా అవుతుంది. కానీ ఇవన్నీ ఒక సినిమాలోకి తీసుకురావడం చాలా కష్టంతో కూడుకున్న పని’ అని అన్నారు.