గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్పరిధిలో రూ.100 కోట్లతో ప్రతి ఇంటికీ తాగునీరు అందించనున్నట్లు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్లో తాగునీటి సరఫరా నల్లా కనెక్షన్లను మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.
ప్రతి ఇంటికి తాగునీటిని అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, కార్పొరేటర్లు రాము, గట్టయ్య, ముస్తఫా పాల్గొన్నారు.
