ఆదిలాబాద్ రిమ్స్ నుంచి రిమాండ్ ఖైదీ పరార్..చోరీ కేసులో నిందితుడు అరెస్ట్

ఆదిలాబాద్ రిమ్స్ నుంచి రిమాండ్ ఖైదీ పరార్..చోరీ కేసులో నిందితుడు అరెస్ట్

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ఆదిలాబాద్​ పట్టణంలోని రిమ్స్​ ఆసుపత్రి నుంచి ఓ ఖైదీ పరారయ్యాడు. జిల్లాలోని ఇంద్రవెల్లికి చెందిన అనిల్​ 15 రోజుల కింద ఉట్నూర్​ పోలీస్​ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసులో అరెస్టయ్యాడు. అతడిని ఆదిలాబాద్​ జిల్లా జైలుకు తరలించారు. నిందితుడు ఎక్కువగా మద్యం సేవించేవాడు కావడంతో రిమ్స్​లోని ఖైదీల వార్డులో అడ్మిట్​ చేశారు. మంగళవారం అతను కనిపించపోవడంతో జైలు సిబ్బంది తనిఖీలు చేపట్టారు.