- హెల్త్ కేర్, పరిశుభ్రత, ఎకో ఫ్రెండ్లీ విభాగాల పనితీరులో పురస్కారం
కోల్బెల్ట్, వెలుగు: హెల్త్ కేర్, పరిశుభ్రత, ఎకో ఫ్రెండ్లీ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనుబర్చిన మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్సింగరేణి ఏరియా ఆస్పత్రి ఉత్తమంగా నిలిచింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించింది.
హైదారాబాద్సనత్నగర్లోని పొల్యూషన్ కంట్రోల్బోర్డు ఆఫీస్లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఏరియా హాస్పిటల్ డీవైసీఎంవో(అడ్మిన్) డాక్టర్ ఎం.మధుకుమార్ పురస్కారాన్ని అందుకున్నారు. హెల్త్ కేర్, పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, హరిత కార్యక్రమాలు, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ నియంత్రణ, ఆస్పత్రి పరిసరాల అభివృద్ధి, పర్యావరణహిత చర్యలను సమర్థవంతంగా అమలు చేసినందుకు ఈ అవార్డు లభించిందని డీవైసీఎంవో హర్షం వ్యక్తం చేశారు.
