హైదరాబాద్, వెలుగు: రాజకీయాల్లో బిజీగా ఉంటూ కళల పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తులు అరుదుగా ఉంటారని..అలాంటి వ్యక్తు్ల్లో బీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఒక రని హీరో రామ్చరణ్అన్నారు.
శనివారం ఆయన సంతోష్ కుమార్ తీసిన ఫొటోలతో రూపొందిన 'వింగ్స్ ఆఫ్ ఫ్యాషన్' అనే పుస్తకా న్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామ్చరణ్ మాట్లాడుతూ.. జీవుల పట్ల కరుణ, జాలి, ప్రేమను కలిగి ఉండి వాటితో నిరంతర సహవాసం చేస్తే తప్ప వాటి తత్వాన్ని అర్థం చేసుకోలేమని తెలిపారు.
సంతోష్ ఎంతగా శ్రమించారో 'వింగ్స్ ఆఫ్ ఫ్యాషన్' పుస్తకా న్ని చూస్తే అర్థమవుతున్నదని చెప్పారు. దేశం లో ఎందరో ఫొటోగ్రాఫర్లు ఉండొచ్చు కానీ.. రాజకీయ రంగం నుంచి వచ్చి ఇలా ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లా ఫొటోలు తీసి.. వాటిని పుస్తకంగా తీసుకొచ్చిన నేత బహుశ సంతోష్ కుమారే కావచ్చని చరణ్ అభిప్రాయపడ్డారు.