తాళం వేసి ఉన్న ఇంట్లో రూ. 90వేల నగదు, 12 తులాల బంగారం చోరీ

తాళం వేసి ఉన్న ఇంట్లో రూ. 90వేల నగదు, 12 తులాల బంగారం చోరీ

తాళం వేసి ఉన్న ఇంట్లో రూ. 90వేల నగదు, 12 తులాల బంగారం చోరీ చేశారు దుండగులు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని రామ్ నగర్ కాలనిలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో ఈరోజు(జనవరి 23) మధ్యాహ్నం దొంగతనం జరిగింది. ఇంటి యజమాని కథనం ప్రకారం..

ఇంటి యజమాని హోటల్ బిజినెస్ చేస్తున్నాడు. అయితే ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో తాళం వేసి.. తమ హోటల్ దగ్గరికి వెళ్లాడు. 2.30 నిమిషాల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తాళం విరగొట్టి.. ఇంట్లో ఉన్న 12 తులాల బంగారం, రూ. 90 వేల నగదును ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.