ఫస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ కొట్టిన అర్జున్ టెండుల్కర్

ఫస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ కొట్టిన అర్జున్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ రంజీ ట్రోఫీలో  సత్తా చాటాడు. తన ఫస్ట్ రంజీ ట్రోఫీ మ్యాచ్ లోనే సెంచరీ చేసి..తండ్రికిదగ్గ తనయుడు అనిపించుకున్నాడు. సచిన్ టెండూల్కర్ కూడా 1988లో తన రంజీ ట్రోఫీ అరంగేట్రంలో గుజరాత్‌పై సెంచరీ కొట్టాడు.

రంజీ ట్రోఫీలో భాగంగా బుధవారం రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో  గోవా తరపున బ్యాటింగ్ కు దిగిన అర్జున్ టెండుల్కర్ సెంచరీ కొట్టాడు. తొలి రోజు ఏడోస్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన అర్జున్ టెండుల్కర్   4 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. ఇవాళ రెండో రోజు ఆట మొదలు పెట్టిన అర్జున్ 207 బంతుల్లో120 పరుగులు(  16 ఫోర్లు, 2 సిక్సులు) చేసి ఔటయ్యాడు.

మరో బ్యాటర్ సుయాంశ్ ప్రభుదేశాయ్ 212(నాటౌట్ )తో స్కోర్ బోర్డ్ ను పరుగులెత్తించిండు. దీంతో గోవా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 493/8 పరుగుల భారీ స్కోర్ చేసింది.

ఈ సీజన్ లో అర్జున్ ముంబై నుంచి ఎన్వోసీ తీసుకుని గోవాకు మార్చుకున్నాడు. ఐపీఎల్ లో అర్జున్ ను ముంబై కొనుగోలు చేసినా ఒక్క మ్యాచ్ లో కూడా ఆడించలేదు.