ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారం

ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారం

కోదాడ రూరల్, వెలుగు: దిశ కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేసిన రోజే కోదాడలో దారుణం చోటుచేసుకుం ది. ఒంటరిగా ఇంట్లో ఉన్న బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన శుక్రవారం సూర్యాపేట జిల్లాలో జరిగింది. కోదాడ మండలంలోని కొమరబండ గ్రామంలో 9వ తరగతి చదువుతున్న బాలిక..తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంది.

అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మంద కోటి.. ఇంట్లోకి చొరబడి బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ ఐ సైదులు గౌడ్ తెలిపారు.