
ములుగు, వెలుగు: సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మకపల్లిలోని ఆర్వీఎం హాస్టిటల్డాక్టర్లు మంచానికే పరిమితమైన వ్యక్తికి అరుదైన మోకాలి చికిత్స చేశారు. కరీంనగర్జిల్లా వీణవంక మండలం శ్రీరాములపేటకు చెందిన జానగిరి మల్లయ్యకు మోకాళ్లు పూర్తిగా అరిగిపోయి కొన్ని రోజులుగా మంచానికే పరిమితమయ్యాడు. కుటుంబ సభ్యులు మల్లయ్యను చాలా ఆస్పత్రుల్లో చూయించినా ఎక్కడా చికిత్స చేయలేదు.
చివరకు ఆర్వీఎం హాస్పిటల్గురించి తెలుసుకొని ఇక్కడికి తీసుకువచ్చారు.ఆర్వీఎం డాక్టర్లు మల్లయ్యకు అన్ని పరీక్షలు ఉచితంగా చేసి డాక్టర్అవినాశ్, వంశీకృష్ణ ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స చేశారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి డైరెక్టర్గోపికృష్ణ, సీఈవో దేవరకొండ శ్రీనివాస్రావు, సూపరింటెండెంట్శ్రీనివాస్, మార్కెటింగ్మేనేజర్మంచినీళ్ల లక్ష్మణ్ కు ధన్యవాదాలు తెలిపారు.