పుష్ప 2 కోసం శ్రీవల్లి

పుష్ప 2 కోసం శ్రీవల్లి

రీసెంట్‌‌గా ‘యానిమల్’ చిత్రంలో గీతాంజలిగా ఆకట్టుకున్న రష్మిక.. తన నెక్స్ట్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టింది. హీరోయిన్‌‌గానే కాకుండా ఫిమేల్ లీడ్‌‌గానూ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. దీంతో ఒక్కో సినిమాకు బ్యాలెన్సుడ్‌‌గా తన డేట్స్‌‌ను సర్దుబాటు చేస్తోంది. ఇటీవల రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌‌లో తెరకెక్కుతున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ సెట్‌‌లో జాయిన్ అయిన రష్మిక ఓ షెడ్యూల్‌‌ను పూర్తి చేసే పనిలో ఉంది. దీని తర్వాత ‘పుష్ప2’ కోసం కాల్షీట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఈ నెల 13 నుంచి ‘పుష్ప ద రూల్’ మూవీ షూటింగ్‌‌లో ఆమె జాయిన్ కానుందట. ఆల్రెడీ కొంత పార్ట్ షూట్ పూర్తి కాగా, బ్యాలెన్స్‌‌ను కూడా  కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకుంటోదట రష్మిక. పార్ట్‌‌2లో అల్లు అర్జున్‌‌కి భార్య శ్రీవల్లి పాత్రలో ఆమె కనిపించనుంది. ప్రెస్టేజీయస్ ప్రాజెక్టుగా సుకుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌‌తో నిర్మిస్తోంది. మరోవైపు  ‘రెయిన్ బో’ సినిమాను కూడా రష్మిక పూర్తి చేయాల్సి ఉంది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.