
బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7)కి మేకర్స్ ఇచ్చిన ఉల్టా పుల్టా క్యాప్షన్ పర్ఫెక్ట్ గ సెట్ అయ్యింది. ఆ విషయంలో ఫుల్లుగా సక్సెస్ అయ్యారు కూడా. ఇందులో భాగంగా వారానికో ట్విస్ట్ ఇస్తూ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నారు బిగ్ బాస్ టీమ్. గత వారం ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ ను ఇంట్లోకి పంపించిన బిగ్ బాస్ వారితో పర్ఫెక్ట్ ఆటను మొదలుపెట్టేశాడు. దీంతో కంటెస్టెంట్స్ మధ్య కొత్త గొడవలు, ఆడియన్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ మొదలైంది.
ఇక ఆ వారంలో మరో ట్విస్టుకు ప్లాన్ చేశాడు బిగ్ బాస్. అదేంటంటే.. గడిచిన ఆరు వారలో అందరు లేడీ కంటెస్టెంట్స్ మాత్రమే ఇంట్లో నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లారు. అందులో చివరగా ఎలిమినేట్ అయిన ముగ్గురిలోంచి ఒక్కరిని మళ్ళీ ఇంట్లోకి పంపడానికి రెడీ అయ్యాడు బిగ్ బాస్. అందులో దామిని, శుభశ్రీ, రతికా ఉన్నారు. అందులో ఎవరు ఇంట్లోకి రావాలనుకుంటున్నారు అనే ఆప్షన్ ను కూడా ఇంటి సభ్యులకే ఇచ్చాడు బిగ్ బాస్. ఈమేరకు మొన్న జరిగిన వీకెండ్ ఎపిసోడ్ లో వోట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ ముగ్గురికీ ఇచ్చాడు బిగ్ బాస్. ముగ్గురు వోట్ అప్పీల్ చేసుకున్నాక.. వారిని బయటకు పంపించి.. వోటింగ్ నిర్వహించాడు బిగ్ బాస్.
వోటింగ్ పూర్తయ్యాక మరో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. అదేంటంటే.. వోటింగ్ లో ఎక్కువ ఓట్స్ వచ్చిన కంటెస్టెంట్ కాకుండా.. తక్కువ వోటింగ్ వచ్చిన కంటెస్టెంట్ ఇంట్లోకి రానున్నారని చెప్పారు. అది విన్న ఇంటి సంభ్యులే కాదు, ఆడియన్స్ కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు.. ఈ వోటింగ్ లో రతికా రోజ్ కి చాలా తక్కువ వోటింగ్ వచ్చిందని, ఆమె మరో రెండు రోజుల్లో ఇంట్లోకి రానుందని తెలుస్తోంది. మరి రెండుసారి అవకాశం దక్కించుకున్న రతికా ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంటుంది, ఎలాంటి గేమ్ ప్లేతో ముందుకు వెళ్తుందో చూడాలి.