కాంగ్రెస్ లోకి వెళ్లడం లేదు.. బీజేపీలోనే ఉంటా : మాజీ ఎంపీ రాథోడ్ రమేష్

కాంగ్రెస్ లోకి వెళ్లడం లేదు.. బీజేపీలోనే ఉంటా : మాజీ ఎంపీ రాథోడ్ రమేష్

అదిలాబాద్ జిల్లా : తెలంగాణ రాష్ట్రం.. కేసీఆర్ కుటుంబ పాలనగా.. నియంత్రణ పాలనగా మారిందని మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వం దండుకోవడం, దోచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. దళితులకు దళితబంధు, గిరిజనులకు గిరిజనబంధు, బీసీలకు లక్ష రూపాయలు ఇస్తామని మాయ మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పారు. 

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు నిజం కావన్నారు రాథోడ్ రమేష్. తాను బీజేపీలోనే ఉంటానని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అదిలాబాద్ జిల్లాఉట్నూర్ మండలంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో రాథోడ్ రమేష్ ఈ కామెంట్స్ చేశారు.