- స్టూడెంట్లను కరిచిన ఎలుకలు
- ఖమ్మం జిల్లా గాంధీనగరం ట్రైబల్వెల్ఫేర్ గురుకులంలో ఘటన
కారేపల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని గాంధీనగరం ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో నిద్రపోతున్న ఐదుగురు స్టూడెంట్లను బుధవారం రాత్రి ఎలుకలు కరిచినయి. టెన్త్క్లాస్ చదువుతున్న సుధీర్, కుమార్, రామచంద్రు, మోక్షజ్ఞ, సాయి అనే ఐదుగురి స్టూడెంట్ల చేతులు, కాళ్లను ఎలుకలు కొరికాయి. దీంతో వారు నిద్రపోకుండా రాత్రంతా జాగారం చేశారు. ఉదయం ప్రిన్సిపల్ ఐదుగురిని తీసుకెళ్లి టీటీ ఇంజక్షన్లు వేయించి చేతులు దులుపుకున్నారు. పుస్తకాలు, పెట్టెలు, బట్టలు, టీచింగ్అన్ని క్లాసురూమ్లోనే కావడంతో ఎలుకలు ఎక్కువై, రాత్రిళ్లు నిద్రపోనివ్వడం లేదని, సమస్యను పరిష్కరించాలని కోరుతూ స్టూడెంట్స్గురువారం ఆందోళనకు దిగారు.
ఇల్లందు- ఖమ్మం ప్రధాన రహదారిపై కూర్చొని నిరసన తెలిపారు. యూత్ కాంగ్రెస్వారికి మద్దతు తెలిపింది. ఎలుక కాటువల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, ఎన్ని సార్లు చెప్పినా ప్రిన్సిపల్పట్టించుకోవడం లేదనిఆరోపించారు. గురుకులంలో కనీస సౌకర్యాలు లేవని, మెనూ ప్రకారం భోజనం కూడా పెట్టడం లేదన్నారు. గురుకులంలో 540 మంది స్టూడెంట్స్కు కేవలం12 డార్మెటరీలు మాత్రమే ఉన్నాయని, ఒక్కో డార్మెటరీలో 25 మందికే చోటు ఉంటే, 40 మందికి పైగా పడుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
కారేపల్లి పోలీసులు అక్కడికి చేరుకొని స్టూడెంట్స్ను స్కూల్లోకి పంపి యూత్కాంగ్రెస్ లీడర్లను స్టేషన్కు తరలించారు. కాగా, స్టూడెంట్ల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు సీఐ ఆరిఫ్ అలీఖాన్కు ఫిర్యాదు చేశారు.