మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ ఈగల్(Eagle). ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వం వహిస్తున్నారు.
లేటెస్ట్గా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చాలా స్టైలీష్ గా ఉంది. తుపాకీ నుండి బులెట్ ఆగేదెప్పుడో తెలుసా..అది పట్టుకున్నవాన్ని తాకినప్పుడు..అంటూ నవదీప్ డైలాగ్ తో స్టార్ట్ అయిన ట్రైలర్ చదరంగపు గడులతో ఆసక్తిగా చూపించారు. విషం మింగుతాను..విశ్వం తిరుగుతాను..ఊపిరి ఆపుతాను..కాపలా అవుతాను..విధ్వంసం నేను..విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను..అంటూ రవితేజ చెప్పే ఇంటెన్స్ డైలాగ్ తో ట్రైలర్ ఆసక్తి కలిగిస్తోంది.
ఓ వైపు టెర్రరిస్టులు, మరోవైపు, నక్సలైట్లు, ఇంకోవైపు ఇంటలిజెన్స్ టీం..ఇలా ప్రపంచం అంతా వెతికే ఒక వెపన్ లా చూపించారు రవితేజని. ఇలాంటి వాడ్ని చూడాలంటే.. మార్గశిరం మధ్యరాత్రి ఓ మొండి మోతుబరి గురుంచి తెలియాలి అని చెప్పే నవదీప్ డైలాగ్ సినిమా కథపై ఆసక్తి రేపుతోంది. ఇన్ని కొత్త అంశాలతో వచ్చిన ఈ ట్రైలర్ తో ఆకలిమీదున్న రవితేజ ఫ్యాన్స్ కి ఆశలు పుట్టించిందనే చెప్పాలి
ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్(Anupama parameswaran) హీరోయిన్ గా నటిస్తోంది. మరో బ్యూటీ కావ్య తాపర్(Kavya tapar) కీ రోల్ లో కనిపిస్తోంది. ఈగల్ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.