కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టిన జడేజా

కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టిన జడేజా

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఒక టెస్టు మ్యాచులో ఐదు వికెట్లు, అర్థసెంచరీ చేయడం జడేజాకు ఇది ఐదోసారి. కపిల్ దేవ్ ఈ ఫీట్ను నాలుగు సార్లు సాధించాడు. దీంతో తాజాగా జడేజా ఐదోసారి ఐదు వికెట్లు, అర్థ సెంచరీ చేయడంతో కపిల్ దేవ్ రికార్డును జడేజా బ్రేక్ చేశాడు. 

నాగ్ పూర్ టెస్టులో టీమిండియా విజయం సాధించింది.  ఇన్నింగ్స్ 132 పరుగులతో ఆసీస్పై గెలిచింది. రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాను భారత బౌలర్లు 91 పరుగులకే ఆలౌట్ చేశారు. అశ్విన్ 5 వికెట్లు పడగొట్టాడు. జడేజా 2 వికెట్లు, మహమ్మద్ షమీ 2 వికెట్లు, అక్షర్కి ఒక వికెట్ దక్కాయి. ఈ విజయంతో నాలుగు మ్యాచుల టెస్ట్ సిరీస్లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది.