బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ స్వింగ్లో ఉన్న రవితేజ జూన్ 17న ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. శరత్ మండవ దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసిన టీమ్ నిన్న ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్ని రిలీజ్ చేశారు. సామ్ సీఎస్ కంపోజ్ చేసిన ఈ మెలోడీ సాంగ్లో రవితేజ, రాజీషా విజయన్ స్టైలిష్ స్టెప్స్తో మెస్మరైజ్ చేస్తున్నారు. ‘బుల్ బుల్ తరంగ్.. బుల్ బుల్ తరంగ్.. లోకం ఊగే గుండె. లబ్ డబ్బుమని నీ పేరై మోగే. ఏదోదో భాషల్లో నవ్వే వాగే పిల్ల.. అల్లాడి నీవైపు మనసే లాగే’ అంటూ రాకేందు మౌళి రాసిన లిరిక్స్ని సిద్ శ్రీరామ్ తనదైన వాయిస్తో పాడి ఆకట్టుకున్నాడు. ఫారిన్ డ్యాన్సర్స్తో స్పెయిన్లో లావిష్గా తీసిన ఈ పాట సినిమాకి హైలైట్ అవుతుందంటున్నారు మేకర్స్. దివ్యాంశ కౌశిక్ మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో వేణు తొట్టెంపూడి కీలకపాత్ర పోషిస్తున్నాడు. దీంతో పాటు ధమాకా, టైగర్ నాగేశ్వరరావు చిత్రాల్లో నటిస్తున్నాడు రవితేజ. తాజాగా బాలకృష్ణతో కలిసి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ వినిపిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కునుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.