మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswararao). దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిక్సుడ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ పెద్దగా రాబట్టుకోలేకపోయింది ఈ సినిమా. కొత్త దర్శకుడు వంశీ(Vamssi) తెరకెక్కించిన ఈ సినిమాలో నుపూర్ సనన్(Nupur Sanon), గాయత్రి భరద్వాజ్(Gayatri bhradwaj) హీరోయిన్లుగా నటించగా.. రేణుదేశాయ్(Renu desai), అనుపమ్ ఖేర్(Anupamkher) కీలక పాత్రల్లో కనిపించారు.
ఇక థియేట్రికల్ రన్ ముగించుకున్న టైగర్ నాగ్వశ్వరరావు సినిమా ఓటీటీ రిలీజ్ సిద్ధమైంది. ఈ సినిమాను ముందుగా డిసెంబర్లో ఓటీటీలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. తాజా సమాచారం ప్రకారం నవంబర్ 24 నుండి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. టైగర్ నాగేశ్వరరావు ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. మరి థియేటర్ లో మిక్సుడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.