బాబీ సింహా, వేదిక, అనసూయ, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే నటీనటులుగా యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన చిత్రం ‘రజాకార్’. మార్చి 15న పాన్ ఇండియా వైడ్గా సినిమా విడుదలవుతున్న సందర్భంగా బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఆర్.నారాయణమూర్తి, బీజేపీ నేతలు కేవీ రమణా రెడ్డి, మాధవీలత, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై సినిమా విజయం సాధించాలని కోరారు.
ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ చరిత్రను మారుమోగేలా చేస్తుందనటంలో సందేహం లేదు అన్నారు చిత్ర దర్శకుడు యాటా సత్యనారాయణ. గతంలో జరిగిన చరిత్రను నేటి తరానికి చెప్పటానికే ‘రజాకార్’ సినిమా చేశామన్నారు నిర్మాత గూడురు నారాయణ రెడ్డి. ఇలాంటి మంచి కథాబలమున్న చిత్రంలో నటించడం హ్యాపీ అన్నారు నటీనటులు. నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, ప్రసాద్ దేవినేని, ప్రదీప్, నటి ఇంద్రజ తదితరులు కార్యక్రమానికి హాజరై సినిమా సక్సెస్ అవ్వాలన్నారు.