పెద్దలనే కాదు.. పేదలనూ చూడాలి.. ఆర్థికసేవలు అందించాలన్న ఆర్బీఐ గవర్నర్

పెద్దలనే కాదు.. పేదలనూ చూడాలి.. ఆర్థికసేవలు అందించాలన్న ఆర్బీఐ గవర్నర్

ముంబై: ఇప్పటికీ ఆర్థిక సేవలు అందని వర్గాలపై దృష్టి సారించాలని ఆర్​బీఐ​ గవర్నర్​ సంజయ్​ మల్హోత్రా దేశీయ ఫిన్‌టెక్​ కంపెనీ కోరారు. ఆర్థిక సేవలను మరింతగా విస్తరించాలని అన్నారు. గ్లోబల్​ ఫిన్‌టెక్​ ఫెస్ట్​లో బుధవారం ఆయన మాట్లాడారు. డబ్బున్న వారికి సేవలు అందించడం లాభదాయకం అయినప్పటికీ, చిన్న సంస్థలపై, సేవలు అందనివారిపై దృష్టి పెట్టాలని సూచించారు. 

సీనియర్​ సిటిజన్లు, తక్కువ డిజిటల్​ పరిజ్ఞానం ఉన్నవారు, ప్రత్యేక సామర్థ్యం ఉన్నవారిని దృష్టిలో ఉంచుకొని సులభంగా ఉపయోగించగలిగేలా ఉత్పత్తులను, సేవలను రూపొందించాలన్నారు.  భారతీయ ఫిన్‌టెక్​ల సంఖ్య 10 వేలకు పెరిగిందని, గత దశాబ్దంలో ఈ కంపెనీలు కలిసికట్టుగా 40 బిలియన్​ డాలర్లకు పైగా సమీకరించాయని చెప్పారు. 

చిన్న వ్యాపారాలు, వ్యక్తులకు లోన్లు అందేలా చూడాలని కోరారు.  డిజిటల్​ మోసాలు రిజర్వ్​ బ్యాంక్​కు సమస్యగా మారుతున్నాయని మల్హోత్రా తెలిపారు.