
ముంబై: రూపాయి విలువ పడిపోకుండా చూడటానికి, మారకం రేటులో అస్థిరతను అరికట్టడానికి ఆర్బీఐ ఈ ఏడాది ఆగస్టు నెలలో 7.7 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 67,767 కోట్లు) విక్రయించింది. ఆర్బీఐ జులైలో అమ్మిన డాలర్లతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. జులై, ఆగస్టు నెలల్లో డాలర్లను కొనుగోలు చేయలేదు.
రూపాయి -డాలర్ మారకం రేటు కోసం ఒక నిర్దిష్ట స్థాయిని లక్ష్యంగా పెట్టుకోబోమని, ఎక్కువ అస్థిరత ఉన్నప్పుడు మాత్రమే విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో జోక్యం చేసుకుంటామని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆగస్టు నెలలో రూపాయి 1.6 శాతం మేర పడిపోయింది.
టారిఫ్ వార్ వంటి వాణిజ్య ఇబ్బందులు, ప్రపంచవ్యాప్త అనిశ్చితులు, ఎఫ్ఐఐలు భారీగా పెట్టుబడులు అమ్మడంతో సెప్టెంబర్లోనూ రూపాయి విలువ యూఎస్ డాలర్తో పోలిస్తే తగ్గింది.