అహ్మదాబాద్: ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు టిమ్ డేవిడ్పై వచ్చే సీజన్కు ఒక మ్యాచ్ నిషేధం పడింది. గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అంపైర్ నితిన్ మీనన్ వైపు ఆగ్రహంతో ఐస్ బ్యాగ్ విసిరినందుకు ఆయన మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా, రెండు డెమెరిట్ పాయింట్లు విధించారు.
ఈ సీజన్లో డేవిడ్ నిబంధనలు ఉల్లంఘించడం ఇది మూడోసారి. దీంతో ఆయన ఖాతాలో మొత్తం ఐదు డెమెరిట్ పాయింట్లు చేరడంతో ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. మ్యాచ్ రెఫరీ జవగల్ శ్రీనాథ్ విధించిన ఈ శిక్షను డేవిడ్ అంగీకరించారు.
