
జీడిమెట్ల, వెలుగు: ఓ ప్రైవేట్ బస్సు ఓ వ్యక్తిని ఢీకొట్టి కల్వర్టులోకి దూసుకెళ్లింది. ఖాజీపల్లిలోని ఆర్డీపీఎల్ కంపెనీకి చెందిన బస్సు సోమవారం ఉదయం సూరారం నుంచి బాలానగర్ వైపు వెళ్తోంది. షాపూర్నగర్ వద్దకు రోడ్డు దాటుతున్న స్వామి అనే వ్యక్తిని ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టి అందులోకే దూసుకెళ్లింది. ప్రమాదంలో గాయపడ్డ స్వామిని స్థానికులు హాస్పిటల్కు తరలించారు. డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు.