
-
దసరానాడే గాంధీ జయంతి కావడంతో ముందే కొనుగోలు
హైదరాబాద్, వెలుగు: దసరా పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. పండుగ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని వైన్స్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్స్ ఫుల్ స్టాక్ పెట్టుకుంటున్నాయి. దసరా రోజే(అక్టోబర్ 2న) గాంధీ జయంతికావడంతో ముందు రోజు బుధవారమే స్టాక్సేల్స్పూర్తవుతాయని వైన్స్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్స్ భావిస్తున్నాయి. దీంతో డిపోల నుంచి పెద్ద ఎత్తున మద్యం లిఫ్టింగ్చేస్తున్నారు. సెప్టెంబర్ 29న ఒక్క రోజులోనే రూ. 278 కోట్ల 66 లక్షల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.
మంగళవారం (సెప్టెంబర్ 30) కూడా రూ.300 కోట్లపైన మద్యం సేల్స్ జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక గురువారం కూడా రూ.300 కోట్ల పైన మద్యం లిప్ట్ చేసే అవకాశం ఉన్నది. మూడో తేదీన కూడా సేల్స్ ఉంటాయని, వరుసగా సెలవులు ఉండటం, స్థానిక ఎన్నికల నగారా మోగడంతో గ్రామాల్లో దవాత్ లు భారీగా చేసుకుంటారని ఎక్సైజ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
సెప్టెంబర్ లో 2, 715 కోట్ల ఆదాయం
సెప్టెంబర్1వ తేదీ నుంచి 29వ తేదీ వరకు 26 లక్షల 71 వేల లిక్కర్ కేసులు, 33 లక్షల 24 వేల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. వీటితో ప్రభుత్వానికి రూ.2, 715 కోట్ల ఆదాయం వచ్చింది. మంగళవారం జరిగిన సేల్స్ కలిపితే 3 వేల కోట్ల రూపాయాలు దాటనుంది. గాంధీ జయంతి నేపథ్యంలో మాంసం, మద్యం దుకాణాలు బంద్ చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రకటించారు. కానీ పల్లెల్లో విక్రయాలు ఆపడం కష్టమని అధికారులు చెప్తున్నారు.