కరోనాను జయించి.. వాలంటీర్లుగా చేస్తున్నరు

కరోనాను జయించి.. వాలంటీర్లుగా చేస్తున్నరు
  • గుజరాత్‌ కరోనా కేర్‌‌ సెంటర్‌‌లో..
  •  సేవలు అందిస్తున్న ఐదుగురు

అహ్మదాబాద్‌: కరోనా మహమ్మారి బారిన పడి.. చికిత్స తీసుకుని కోలుకున్న ఐదుగురు వ్యక్తులు కరోనా కేర్‌‌ సెంటర్‌‌లో మిగతా పేషంట్లకు సేవలు అందించేందుకు వాలంటీర్లుగా చేరారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన వీరు.. కేర్​సెంటర్‌‌లో వాలంటీర్లుగా చేసేందుకు ముందుకు వచ్చారని అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌‌ విజయ్‌ నెహ్రా చెప్పారు. కరోనా ట్రీట్‌మెంట్‌ తీసుకున్న వారికి ఇమ్యూనిటీ పవర్‌‌ పెరుగుతుందని, అందుకే వారిని దీని కోసం అనుమతిచ్చామని అన్నారు. ఇప్పటి వరకు ఏడుగురు కోలుకోగా.. ఐదుగురు సేవలు అందించేందకు ఒప్పుకున్నారన్నారు. ఆ ఐదుగురికి పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ)లు ఇచ్చామని అన్నారు. కరోనా నుంచి కోలుకుని వాలంటీర్లుగా చేసేందుకు ముందుకు రావడం అభినందనీయనమని నెహ్రా అన్నారు. కరోనాను జయించిన వారు ఇలా సేవలు అందించడం ఇదే మొదటిసారని చెప్పారు. శనివారం సాయంత్రానికి అహ్మదాబాద్‌లో 243 కేసులు నమోదు కాగా.. వారిలో 10 మంది చనిపోయారని అధికారులు చెప్పారు.