101 కోట్ల అప్పు తీర్చిన వికాస్​ ఎకోటెక్

101 కోట్ల అప్పు తీర్చిన వికాస్​ ఎకోటెక్

న్యూఢిల్లీ: రీసైక్లింగ్​ రంగంలోని వికాస్​ఎకోటెక్​ రూ. 101 కోట్ల అప్పును తిరిగి చెల్లించినట్లు సోమవారం ప్రకటించింది. 2023–24 చివరినాటికి అప్పులు లేని కంపెనీగా మారాలని టార్గెట్​గా పెట్టుకున్నట్లు వెల్లడించింది. చెల్లించాల్సిన అప్పులు మరో రూ. 60 కోట్లు మాత్రమే మిగిలాయని, సెప్టెంబర్​ చివరిలోపు రూ. 10 కోట్లు చెల్లిస్తామని కంపెనీ పేర్కొంది.  

రీసైక్లింగ్​ ప్రాసెస్​లో వికాస్​ ఎకోటెక్​ పీఈటీ కాంపౌండ్స్​, పీవీసీ కాంపౌండ్స్​ను ఇండస్ట్రియల్​ అప్లికేషన్స్​ కోసం  తయారు చేస్తోంది. ఎలక్ట్రికల్​, ఇన్​ఫ్రాస్ట్రక్చర్​, ప్యాకేజింగ్​, ఆటోమోటివ్​ రంగాల కోసం స్పెషాలిటీ పాలిమర్స్ ​మాన్యుఫాక్చరింగ్​ను కూడా చేపట్టింది.