
న్యూఢిల్లీ: రీసైక్లింగ్ రంగంలోని వికాస్ఎకోటెక్ రూ. 101 కోట్ల అప్పును తిరిగి చెల్లించినట్లు సోమవారం ప్రకటించింది. 2023–24 చివరినాటికి అప్పులు లేని కంపెనీగా మారాలని టార్గెట్గా పెట్టుకున్నట్లు వెల్లడించింది. చెల్లించాల్సిన అప్పులు మరో రూ. 60 కోట్లు మాత్రమే మిగిలాయని, సెప్టెంబర్ చివరిలోపు రూ. 10 కోట్లు చెల్లిస్తామని కంపెనీ పేర్కొంది.
రీసైక్లింగ్ ప్రాసెస్లో వికాస్ ఎకోటెక్ పీఈటీ కాంపౌండ్స్, పీవీసీ కాంపౌండ్స్ను ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కోసం తయారు చేస్తోంది. ఎలక్ట్రికల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్యాకేజింగ్, ఆటోమోటివ్ రంగాల కోసం స్పెషాలిటీ పాలిమర్స్ మాన్యుఫాక్చరింగ్ను కూడా చేపట్టింది.