
- భూమిపై పండిన దాని కన్నా పోషకాల్లో మిన్న: నాసా
భూమ్మీద పండించిన లెట్యూస్ (క్యాబేజీ లాంటి ఆకు కూర) కన్నా కూడా స్పేస్లో పండించిన లెట్యూసే మస్త్ టేస్ట్ ఉందట. పోషకాల్లోనూ అదే బెటరట. అవును, వెజిటబుల్ ప్రొడక్షన్ సిస్టమ్ ప్రాజెక్ట్లో భాగంగా 2014 నుంచి 2016 దాకా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)లో లెట్యూస్ను పండించారు. దానిని టెస్టుల కోసం భూమ్మీదకు తీసుకొచ్చారు. భూమ్మీద పండించిన వాటి కన్నా స్పేస్లో పండించిన లెట్యూస్ రుచికరంగా ఉందని గుర్తించారు. అంతేకాదు, భూమిపై పండిన వాటితో పోలిస్తే ఐఎస్ఎస్లో పండిన లెట్యూస్లో ఎక్కువ పోషకాలున్నాయని, అసలు క్రిములన్న మాటే లేదని తేల్చారు. ఐఎస్ఎస్ ఆస్ట్రోనాట్లకు పంపించే ప్యాకేజ్డ్ ఫుడ్లలో విటమిన్ కే, బీ1, సీలు చాలా తక్కువని, ఇప్పుడు ఈ లెట్యూస్తో ఆ బెడద తీరిపోతుందని దానిని టెస్ట్ చేసిన నాసా లీడ్ సైంటిస్ట్ క్రిస్టినా ఖోదద్ చెప్పారు. స్పేస్ లెట్యూస్లో ఎక్కువ పోషకాలుండడానికి కారణం, తక్కువ గురుత్వాకర్షణలో పండడమే కావొచ్చన్నారు.
ఐఎస్ఎస్కు టూరిస్టులు.. స్పేస్ఎక్స్ డీల్
ఐఎస్ఎస్కు టూరిస్టులను తీసుకువెళ్లేలా స్పేస్ ఎక్స్ ఒప్పందం చేసుకుంది. ఆస్ట్రోనాట్లతో పాటు కొందరు టూరిస్టులను వచ్చే ఏడాది ఐఎస్ఎస్కు తీసుకుపోయేలా ఏగ్జియమ్ స్పేస్ అనే స్టార్టప్తో డీల్ సెట్ చేసింది. స్పేస్క్రూ డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్ ద్వారా ఐఎస్ఎస్కు టూరిస్టులను తీసుకుపోనుంది. 2021 రెండో అర్ధభాగంలో ఈ ప్రయోగం చేయబోతున్నట్టు స్పేస్ఎక్స్, ఏగ్జియమ్లు కలిసి ప్రకటించాయి. అయితే, ఆ టూర్కు అయ్యే ఖర్చు విషయాలను మాత్రం కంపెనీలు వెల్లడించలేదు.