ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ గతేడాది సూసైడ్ చేసుకొని చనిపోయిన సంగతి తెలిసిందే. గురువారం ఆయన బర్త్ డే కావడంతో క్వీన్ కంగనా రనౌత్ సుశాంత్ను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేసింది. ముంబై కేంద్రంగా నడుస్తున్న హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ సుశాంత్ను బ్యాన్ చేయడానికి కుట్రలు పన్నిందని కంగన మండిపడింది. సుశాంత్ది ఆత్మహత్య కాదని, పరిశ్రమలోని కొందరు వ్యక్తులు కలసి చేసిన హత్యగా ఆరోపించింది. ‘డియర్ సుశాంత్, మూవీ మాఫియా నిన్ను నిషేధించింది, బెదిరించింది, వేధించింది. సోషల్ మీడియాలో చాలాసార్లు నువ్వు సాయం కోసం అడిగావు. ఆ సమయంలో నీకు అండగా నిలబడనందుకు పశ్చాత్తాపంగా ఉంది. మాఫియా టార్చర్ను నువ్వు దీటుగా ఎదుర్కొంటావని భావించా. కానీ అది జరగలేదు. హ్యాపీ బర్త్ డే డియర్ సుశాంత్’ అంటూ కంగన ట్వీట్ చేసింది.
Dear Sushant, movie mafia banned you bullied you and harassed you, many times on social media you aksed for help and I regret not being there for you. I wish I didn’t assume you are strong enough to handle mafia torture on your own. I wish …
Happy Birthday dear one #SushantDay pic.twitter.com/xqgq2PBi0Y— Kangana Ranaut (@KanganaTeam) January 21, 2021