తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్న చిత్రం ‘ఓ..! సుకుమారి’. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్కు మంచి రెస్పాన్స్ రాగా, మంగళవారం ఈ మూవీ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు. జులై 17న ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో హీరో, హీరోయిన్ ఒకరినొకరు తాకబోతున్న క్షణాన్ని మెరుపులతో విజువల్గా చూపించిన తీరు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. హీరోయిన్ను తాకిన ఎవరికైనా కరెంట్ షాక్ కొడుతుందనే ఒక విచిత్రమైన కాన్సెప్ట్తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
