హైదరాబాద్, వెలుగు: నిందితులను అరెస్ట్ చేసే సమయంలో రూల్స్ పాటించాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)ను హైకోర్టు ఆదేశించింది. అక్రమంగా అరెస్ట్ చేసిన దుబాసి దేవేందర్ను వెంటనే రిలీజ్ చేయాలని చత్తీస్గఢ్లోని జగల్పూర్ జిల్లా జైలు సూపరింటెండెంట్, ఎన్ఐఏ ఆఫీసర్లకు ఆదేశాలిచ్చింది. సిద్దిపేట ప్రభుత్వ కాలేజ్లో ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన తన భర్త దేవేందర్ను మఫ్టీలో ఉన్న పోలీసులు అరెస్ట్ చేసి ములుగు పోలీస్ స్టేషన్కు తరలించారని అతని భార్య స్వప్న హైకోర్టును ఆశ్రయించారు.
ములుగు పోలీస్ స్టేషన్ నుంచి చత్తీస్గఢ్ తీసుకెళ్లారని, తన భర్తకు ప్రాణ హాని ఉందన్నారు. దేవేందర్ మావోయిస్టులకు కొరియర్గా పని చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని, 2019లో కేసు నమోదైందని కోర్టుకు ఎన్ఐఏ అధికారులు వివరించారు. 41ఏ నోటీసు కూడా ఇచ్చామని తెలిపారు. అయితే, ఆ నోటీసులో విజయవాడ ఎన్ఐఏ క్యాంప్ ఆఫీస్ అడ్రస్ ఉండటాన్ని కోర్టు తప్పుబడుతూ, దేవేందర్ను విడుదల చేయాలని ఆదేశించింది.