హైకోర్టులో చిరంజీవికి ఊరట

హైకోర్టులో చిరంజీవికి ఊరట

ప్రముఖ సినీ నటుడు, కాంగ్రెస్ నేత చిరంజీవికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై దాఖలైన కేసును హైకోర్టు రద్దు చేసింది. ఎన్నికల నియమావళి 2014 ఏప్రిల్‌ 27న రాత్రి 10 గంటలు దాటినా ఎన్నికల ప్రచారం చేశారంటూ గుంటూరు అరండల్‌పేట పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. దీనిపై  చిరంజీవి ఉమ్మడి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందులో భాగంగా జరిగిన విచారణలో ఇరు పక్షాల వాదనను విన్న కోర్టు.. కేసును రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.