కిందికి వేలాడుతున్న కేబుళ్లను తొలగించండి..టీజీఎస్పీడీసీఎల్ ఎండీ ముషారఫ్ ఫరూఖీ

కిందికి వేలాడుతున్న కేబుళ్లను తొలగించండి..టీజీఎస్పీడీసీఎల్  ఎండీ ముషారఫ్ ఫరూఖీ

హైదరాబాద్​ సిటీ, వెలుగు: బస్తీల్లో నిరంతర విద్యుత్ సరఫరాకు తోడు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని దక్షిణ టీజీఎస్​పీడీసీఎల్​చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ ఆదేశించారు. మంగళవారం ఆయన బంజారాహిల్స్ సర్కిల్ పరిధిలోని మోతీనగర్, ఇందిరా నగర్ బస్తీ, హెచ్ఎఫ్​నగర్ బస్తీ, బోరబండ సైట్ 2 బస్తీలోఎల్అండ్ టీ నెట్​వర్క్​ను తనిఖీ చేశారు.

బస్తీల్లో, కాలనీల్లో ఇండ్ల ముందు ప్రమాదకరంగా ఉన్న ఎల్టీ నెట్​వర్క్​ ఓవర్ హెడ్ లైన్లను ఎయిర్ బంచెడ్ కేబుల్​తో మారుస్తున్నామన్నారు. గుట్టలు గుట్టలుగా కిందికి వేలాడుతున్న  కేబుళ్లను తొలగించాలని  సిబ్బందికి ఆదేశించారు. ఇండ్లకు దగ్గరగా ఉన్న ఓవర్ హెడ్ లైన్ స్థానంలో ఏబీ కేబుల్ ను అమర్చడంపై బస్తీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. డైరెక్టర్ ఆపరేషన్స్​ డా. నర్సింహులు, మెట్రోజోన్ చీఫ్ ఇంజినీర్  ప్రభాకర్, కరుణాకర్ బాబు, భీమా నాయక్ పాల్గొన్నారు.