
హైదరాబాద్ సిటీ, వెలుగు: బస్తీల్లో నిరంతర విద్యుత్ సరఫరాకు తోడు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని దక్షిణ టీజీఎస్పీడీసీఎల్చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ ఆదేశించారు. మంగళవారం ఆయన బంజారాహిల్స్ సర్కిల్ పరిధిలోని మోతీనగర్, ఇందిరా నగర్ బస్తీ, హెచ్ఎఫ్నగర్ బస్తీ, బోరబండ సైట్ 2 బస్తీలోఎల్అండ్ టీ నెట్వర్క్ను తనిఖీ చేశారు.
బస్తీల్లో, కాలనీల్లో ఇండ్ల ముందు ప్రమాదకరంగా ఉన్న ఎల్టీ నెట్వర్క్ ఓవర్ హెడ్ లైన్లను ఎయిర్ బంచెడ్ కేబుల్తో మారుస్తున్నామన్నారు. గుట్టలు గుట్టలుగా కిందికి వేలాడుతున్న కేబుళ్లను తొలగించాలని సిబ్బందికి ఆదేశించారు. ఇండ్లకు దగ్గరగా ఉన్న ఓవర్ హెడ్ లైన్ స్థానంలో ఏబీ కేబుల్ ను అమర్చడంపై బస్తీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. డైరెక్టర్ ఆపరేషన్స్ డా. నర్సింహులు, మెట్రోజోన్ చీఫ్ ఇంజినీర్ ప్రభాకర్, కరుణాకర్ బాబు, భీమా నాయక్ పాల్గొన్నారు.