- ప్రధానికి ప్రియాంక గాంధీ లేఖ
లక్నో: సాగు చట్టాలను వెనక్కి తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ఉద్దేశం నిజంగా మంచిదే అయితే.. లక్నోలో జరిగే డీజీపీల మీటింగ్లో కేంద్ర మంత్రి
అజయ్ మిశ్రాతో కలిసి వేదిక పంచుకోవద్దని కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె శనివారం ప్రధానికి లేఖ రాశారు.
లఖీంఫూర్ఖేరీ కేసులో నిందితుడి తండ్రి అయిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలన్నారు. లక్నోలో శనివారం ప్రారంభమైన
డీజీపీల కాన్ఫరెన్స్కు ముందు ఆమె ప్రధానికి రాసిన లేఖను మీడియా ముందు చదివి వినిపించారు. ఇవాళ మీరు నిజంగా రైతుల వైపు నిలబడి ఉంటే
అతడిని పదవి నుంచి తొలగించాలని అన్నారు.