
- కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర వెల్లడి
కామారెడ్డి, వెలుగు : సెల్ఫ్డ్రైవింగ్కోసం కార్లను అద్దెకు తీసుకుని అమ్ముతున్న ముఠాలోని నలుగురిని కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన ఉప్పల్వాయి ప్రశాంత్గౌడ్కొద్దిరోజుల కింద ఆన్లైన్లో చూసి కారును కొనుగోలు చేసి మోసపోయాడు. ఈనెల18న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
ఎస్పీ ఆదేశాలతో ఏఎస్పీ ఏఎస్పీ చైతన్యారెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్నిఘా పెట్టి ముఠాలోని సభ్యులను అరెస్టు చేసింది. రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్జిల్లాలకు చెందిన మహమ్మద్ఇయాజ్, మహమ్మద్ జాహీద్, పృథ్వీ జగదీశ్, రాచర్ల శివకృష్ణ, కర్ణకోట సాకేత్, వేములయాడ వివేక్, అలీ ముఠాగా గుర్తించింది.
వీరు సెల్ఫ్డ్రైవింగ్కోసం పలువురి వద్ద కార్లను అద్దెకు తీసుకుని.. నంబర్ప్లేట్మార్చి, ఫేక్ఆర్సీ, ఆధార్వంటి డాక్యుమెంట్లు సృష్టించి ఆన్లైన్ ద్వారా అమ్ముతున్నారు. ఆ తర్వాత కొనుగోలు చేసిన వ్యక్తులను బెదిరించడం, ఎక్కడైనా పార్కింగ్ చేసి ఉంటే మరో లాక్ తో తీసుకెళ్లడం చేస్తున్నారు.
ముఠాలోని మహమ్మద్ ఇయాజ్, మహమ్మద్ జాహీద్, కర్ణకోట సాకేత్, వేములయాడ వివేక్ను అరెస్టు చేసి.. 3 కార్లు, 15 సెల్ఫోన్లు, జీపీఎస్పరికరాలు, 1 ల్యాప్టాప్, 10 మైక్రోసిమ్కార్డులు, చిప్కార్డులు, ఫోర్జరీ చేసిన ఆర్సీలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే వీరిపై పలు ప్రాంతాల్లోని పీఎస్ ల్లో కేసులు నమోదై ఉన్నాయి. కామారెడ్డి రూరల్ సీఐ రామన్, మాచారెడ్డి ఎస్ఐ అనిల్, సిబ్బంది సుభాష్, సిద్దిరాములు, శ్రీకాంత్, శ్రీనివాస్ను ఎస్పీ అభినందించారు.