- ఎక్కువగా లిక్కర్ రెవెన్యూ పొందుతున్న టాప్ 3
- రాష్ట్రాల్లో తెలంగాణ
- ఐఎస్డబ్ల్యూఏఐ రిపోర్టు వెల్లడి
హైదరాబాద్, వెలుగు ; ఆల్కహాల్ బెవరేజెస్ వినియోగంలో దేశంలోని టాప్ రాష్ట్రాలలో తెలంగాణ ఒకటిగా నిలిచినట్లు ఒక రిపోర్టు వెల్లడించింది. ఇండియాలోని ఆల్కహాల్ బెవరేజెస్ ఎకనమిక్ వాల్యూ ఎడిషన్ 2023 పేరుతో ఈ ఇండస్ట్రీపై మొదటి రిపోర్టును ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎస్డబ్ల్యూఏఐ) తీసుకొచ్చింది. రిపోర్టు కాపీని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎక్సైజ్ కమీషనర్ మొహమ్మద్ ముషారఫ్ అలీ ఫరూఖీలకు ఐఎస్డబ్ల్యూఏఐ సీఈఓ నీతా కపూర్ అందచేశారు. ఆల్కహాల్ బెవరేజెస్ ప్రీమియం ప్రొడక్టుల కన్జంప్షన్లో తెలంగాణ 52 శాతం వాటా దక్కించుకున్నట్లు ఈ రిపోర్టు వెల్లడించింది.
దేశానికి, వివిధ రాష్ట్రాలకు ఆల్కహాల్ బెవరేజెస్ ఇండస్ట్రీ వల్ల కలుగుతున్న ప్రయోజనాలను కూడా ప్రస్తావించింది. ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సవాళ్లను సైతం వివరించింది. ఆల్కహాల్ బెవరేజస్ ఇండస్ట్రీపై వ్యాట్, ఎక్సైజ్ ద్వారా అత్యధిక ఆదాయం పొందుతున్న మూడు రాష్ట్రాలలో తెలంగాణ ప్లేస్ సాధించుకున్నట్లు ఐఎస్డబ్ల్యూఏఐ రిపోర్టు తెలిపింది. ఆల్కహాల్ బెవరేజెస్ ఇండస్ట్రీ ఒక ప్రధానమైన ఎకనమిక్ ఇంజిన్గా నిలుస్తున్న నేపథ్యంలో ఈ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు పరిష్కారమయ్యే దిశలో ప్రభుత్వాలు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని నీతా కపూర్ ఈ సందర్భంగా వెల్లడించారు.
రాష్ట్రంలో ఆల్కహాల్ జోరుఆల్కహాల్ బెవరేజెస్ వినియోగంతో పాటే వివిధ ధాన్యాలు, మొలాసిస్, ద్రాక్ష ప్రొడక్షన్ కూడా పెరుగుతోందని ఐఎస్డబ్ల్యూఏఐ సెక్రటరీ జనరల్సురేష్ మీనన్ చెప్పారు. ఫలితంగా దేశంలోని రైతులకు ప్రయోజనం కలుగుతోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 14 కోట్ల లీటర్ల ఆల్కహాలిక్ స్పిరిట్తయారీ సామర్ధ్యం ఉందని, దేశం మొత్తం మీద చూస్తే ఇది 1.5 శాతానికి సమానమని పేర్కొన్నారు.