మాకు ప్రోత్సాహం కావాలె : అంధుల టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌ విన్నర్ల రిక్వెస్ట్‌‌

మాకు ప్రోత్సాహం కావాలె : అంధుల టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌ విన్నర్ల రిక్వెస్ట్‌‌

న్యూఢిల్లీ: అంధుల టీ20 వరల్డ్‌‌కప్‌‌లో వరుసగా మూడోసారి విజేతగా నిలిచిన ఇండియా క్రికెటర్లు బీసీసీఐ సపోర్ట్‌‌ కోరుతున్నారు.  ఆర్థిక ప్రోత్సాహం అందించడంతో పాటు తమకు సరైన రోడ్‌‌మ్యాప్‌‌ రెడీ చేయాలని ఇండియా బ్లైండ్‌‌ టీమ్‌‌ కెప్టెన్‌‌ అజయ్‌‌ కుమార్‌‌ రెడ్డి విజ్ఞప్తి చేశాడు. వరల్డ్‌‌ కప్‌‌ నెగ్గిన ఇండియా టీమ్‌‌ ను సెంట్రల్‌‌ స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్‌‌ ఠాకూర్‌‌ సోమవారం సన్మానించారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన అజయ్‌‌..   టీ20 కప్‌‌ నెగ్గిన 17 మందితో కూడిన ఇండియా టీమ్‌‌లో పది మందికి ఎలాంటి ఉద్యోగం లేదన్నాడు. ఫైనాన్షియల్‌‌ సపోర్ట్‌‌ లేకపోవడంతో చాలా మంది ఈ ఆటలో కొనసాగలేకపోతున్నారని అజయ్‌‌ వాపోయాడు. వరుసగా మూడోసారి ప్రపంచ కప్‌‌ గెలిచినా, తమకు టైటిల్‌‌ స్పాన్సర్‌‌ లేకపోవడం శోచనీయమన్నాడు.