కురుమ హాస్టల్ కు భూమి కేటాయించాలి..మంత్రి వివేక్ కు వినతి

కురుమ హాస్టల్ కు  భూమి కేటాయించాలి..మంత్రి వివేక్ కు  వినతి

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలో కురుమ హాస్టల్, కుల సంఘం భవనం​ కోసం ఎకరం భూమిని కేటాయించాలని కోరుతూ రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామిని కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుంట శ్రీశైలం కోరారు. 

శుక్రవారం హైదరాబాద్​లో మంత్రిని సంఘం బాధ్యులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాకు చెందిన కురుమ విద్యార్థులు చదువుకోవడానికి వచ్చి అద్దె ఇండ్లలో కిరాయికి ఉంటూ ఇబ్బందులు పడుతున్నారని, ఎకరం భూమి కేటాయించి విద్యార్థుల కోసం హాస్టల్, కుల సంఘం భవనం​ నిర్మించేందుకు సహకరించాలని కోరారు. ఇందుకు మంత్రి స్పందిస్తూ భూమి కేటాయింపుకు చర్యలు తీసుకోవాలని ఫోన్​లో మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్​ను ఆదేశించారు. మందమర్రి టౌన్​కాంగ్రెస్ ప్రెసిడెంట్​తిరుమల్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.