రీసెర్చ్‌‌‌‌ : ఇండియాలో కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రోత్‌‌‌‌కు అవకాశాలు బాగున్నాయ్‌‌‌‌

రీసెర్చ్‌‌‌‌ : ఇండియాలో కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రోత్‌‌‌‌కు అవకాశాలు బాగున్నాయ్‌‌‌‌

న్యూఢిల్లీ : ఈ ఏడాది జాబ్​ మార్కెట్లో పోటీ బాగా పెరుగుతుందని, పనిచేసే ప్రతి నలుగురు ప్రొఫెషనల్స్​లో ముగ్గురు జాబ్​ మారాలని కోరుకుంటున్నారని ఒక సర్వేలో తేలింది. సర్వేలో 1,016 మంది పాల్గొన్నారు. ఉద్యోగాలలో ఉన్న మూడొంతుల మంది 2021లో కొత్త కొత్త రోల్స్​, కొత్త జాబ్స్​ కావాలనుకుంటున్నట్లు ఈ సర్వేలో తేలిందని లింక్డ్​ ఇన్​ జాబ్​ సీకర్​ రీసెర్చ్​ వెల్లడించింది. కెరీర్​ గ్రోత్​కు దేశంలో అవకాశాలు బాగున్నాయనే ఆశాభావం 64 శాతం మంది ప్రొఫెషనల్స్​లో వ్యక్తమైందని, భవిష్యత్​బాగుంటుందనే ధీమా వారిలో కనిపిస్తోందని పేర్కొంది. కెరీర్​ భవిష్యత్​ కోసం నెట్​వర్కింగ్​ ఈవెంట్స్​అటెండ్​ అవ్వాలనే ఆలోచనను 38 శాతం మంది వ్యక్తం చేశారని తెలిపింది. 2021లో కొత్త జాబ్​ రావాలంటే ఆన్​లైన్​లెర్నింగ్​లో ఇన్వెస్ట్​మెంట్​ తప్పనిసరనే అభిప్రాయాన్ని 37 శాతం మంది ప్రకటించారని కూడా లింక్డ్​ ఇన్​ జాబ్​ సీకర్​ రీసెర్చ్​ సర్వేలో తేలింది.

కరోనా వలన మార్పొచ్చింది…

2021లో జాబ్​ మార్కెట్లో పోటీ బాగా పెరగడంతో ప్రొఫెషనల్స్​లో కొంత వర్రీ మొదలైందని సర్వే పేర్కొంది. రిక్రూట్​మెంట్​ స్టేజెస్​ ఎక్కువగా ఉండటం పట్ల మూడో వంతు మంది కొంత ఆందోళన చెందుతున్నట్లు కూడా తేలింది. అప్లికేషన్​ డాక్యుమెంట్స్​ దీర్ఘంగా ఉండటం కూడా ఇబ్బందికరంగా ఉందని 75 శాతం మంది అభిప్రాయపడుతున్నట్లు తెలిపింది. నెట్​వర్కింగ్​ ఉపయోగంపై  మూడొంతుల మందిలో పెద్దగా ఆసక్తి కనబడటం లేదని కూడా సర్వే పేర్కొంది. రోజు రోజుకీ మారుతున్న జాబ్​ రిక్రూట్​మెంట్​పై ప్రొఫెషనల్స్​లో అవగాహన పెంచేందుకు 2021 జాబ్స్​ ఆన్​ ది రైజ్ ఇండియా లిస్ట్​ను లింక్డ్​ ఇన్​ ప్రకటించింది.​ ఇందులో ప్రొఫెషనల్స్​కు అవసరమైన కీలకాంశాలను పొందుపరిచారు. దేశంలో వేగంగా పెరుగుతున్న 15 కెరీర్​ ఆపర్చునిటీస్​ను లిస్ట్​లో లింక్డ్​ ఇన్​ ప్రస్తావించింది. ఏప్రిల్​నుంచి అక్టోబర్​2020 మధ్యలో దేశంలో జరిగిన రిక్రూట్​మెంట్స్​ ఆధారంగా లిస్ట్​ను రూపొందించినట్లు తెలిపింది. కరోనా మహమ్మారి రాకతో 2020లో జాబ్​ మార్కెట్లో చోటు చేసుకున్న మార్పులు, వర్క్​ ఎకో సిస్టమ్​లను జాబ్స్​ ఆన్​ ది రైజ్​ ఇండియా లిస్ట్​ ప్రతిఫలిస్తుందని కూడా లింక్డ్​ ఇన్​ పేర్కొంది. దేశంలోని అన్ని ఇండస్ట్రీస్​ను డిజిటల్​ ట్రాన్స్​ఫార్మేషనే ముందుకు నడిపిస్తోందని చెబుతూ, టెక్నాలజీ, నాన్​–టెక్నాలజీ విభాగాలలోని ఉద్యోగులు రిమోట్​గా కలిసి పనిచేయడాన్ని 2020 నేర్పించిందని లింక్డ్​ ఇన్​ టాలెంట్​ అండ్​ లెర్నింగ్​ సొల్యూషన్స్​ డైరెక్టర్​ రుచీ ఆనంద్​చెప్పారు. కంటెంట్​ క్రియేటర్స్​తోపాటు, ఆడియన్స్​ను పెంచే వారు బ్రాండ్స్​కు కీలకమని ఆనంద్​ పేర్కొన్నారు.

కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌ క్రియేటర్స్‌‌‌‌కు అవకాశాలు..

2021లో ఫ్రీలాన్స్​ కంటెంట్​ క్రియేటర్స్​, మార్కెటింగ్​, సోషల్​ మీడియా, డిజిటల్​ మార్కెటింగ్​ రోల్స్​కు ఎక్కువ అవకాశాలు వచ్చే ఛాన్సుందని లింక్డ్​ ఇన్​ రీసెర్చ్​ తేల్చింది. ఇంజినీరింగ్​, ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​, సైబర్​ సెక్యూరిటీ, డేటా సైన్స్​లపై రిక్రూటర్ల ఆసక్తి కొనసాగనుందని వెల్లడించింది. డిజిటల్​ ఫస్ట్​ కాన్సెప్ట్​ దూసుకెళ్తున్న నేపథ్యమే దీనికి కారణమని పేర్కొంది. ఈ ఏడాది ఫైనాన్స్​, ఎడ్యుకేషన్​, హెల్త్​కేర్​, ఈ–కామర్స్​ రోల్స్​కు పాపులారిటీ పెరుగుతుందని, కోవిడ్​ –19తో కస్టమర్​ సర్వీసెస్​ రోల్స్​ ఆదరణా ఎక్కువైందని తెలిపింది. ఆన్​లైన్​లో సర్వీసెస్​ డెలివరీ చేసేప్పుడు కస్టమర్లకు ఉండే ఇబ్బందులు తొలగించేందుకు కస్టమర్​ సర్వీసెస్​ ఉద్యోగులు ముఖ్యమనే అభిప్రాయం కంపెనీలలో ఏర్పడినట్లు పేర్కొంది. జీవితమంతా నేర్చుకుంటూ ఉండాలనే తపనే  టాలెంట్​ను పెంచడంతోపాటు, ముందుండేలా చేస్తుందని కూడా లింక్డ్​ ఇన్​ రీసెర్చ్​ వెల్లడించింది.

టాప్​ కెరీర్​​ ట్రెండ్స్​….
కంటెంట్​ క్రియేటర్స్​
సోషల్​ మీడియా డిజిటల్​ మార్కెటింగ్​
ఫైనాన్స్​ ఎడ్యుకేషన్​
ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​
డేటా సైన్స్​ హెల్త్​కేర్​
హ్యూమన్​ రిసోర్సెస్​ (హెచ్​ఆర్​)