కుమారస్వామి వెంటనే రాజీనామా చేయాలి: యెడ్యూరప్ప

కుమారస్వామి వెంటనే రాజీనామా చేయాలి: యెడ్యూరప్ప

కుమారస్వామి సర్కార్ పడిపోగానే ప్రభుత్వం ఏర్పాటు చేసేలా బీజేపీ పావులు కదుపుతోంది. ముఖ్యమంత్రి కుమారస్వామి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు యెడ్యూరప్ప. ఇద్దరు ఇండిపెండెంట్లు, 15మంది కాంగ్రెస్, JDS ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని.. మెజార్టీ లేనప్పుడు  కుమారస్వామి సీఎంగా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. రాజీనామాలు చేసినవారంతా బీజేపీకి మద్దతిస్తున్నారని చెప్పారు యెడ్యూరప్ప.