ప్రయాణికులకు 24 గంటలు నాణ్యమైన భోజనం
సికింద్రాబాద్, వెలుగు: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి కాచిగూడ రైల్వే స్టేషన్ఆవరణలో రెస్టారెంట్ ఆన్వీల్స్ హోటల్ను సోమవారం దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. తెలంగాణలో మొదటిసారిగా రైల్వే కోచ్లో రెస్టారెంట్ను అందుబాటులోకి తెచ్చింది. రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రెన్స్ గేటు వద్ద దీన్ని ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్కు చెందిన పరివార్స్ హ్యవ్ మోర్ కేటరింగ్ సంస్థకు లీజుకు ఇచ్చింది. నార్త్, సౌత్ ఇండియా, మొఘలాయ్, చైనీస్ లాంటి వంటకాలు అందుబాటులో ఉంటాయి. రెండు హెరిటేజ్ కోచ్ల్లో రెస్టారెంట్ ఆన్వీల్స్లో నాణ్యమైన భోజనం ప్రయాణికులకు 24 గంటల పాటు అందించనున్నామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు.