
- పప్పులు, కూరగాయలు, పండ్లు, గుడ్ల ధరలు తగ్గడమే కారణం
న్యూఢిల్లీ: ఇండియాలో ద్రవ్యోల్బణం మరింత దిగొచ్చింది. ఈ ఏడాది మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కొలిచే కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) ఆరేళ్ల కనిష్టమైన 2.82 శాతానికి తగ్గింది. ఫుడ్ ఐటెమ్స్ (కూరగాయలు, పండ్లు, ప్రోటీన్- ఎక్కువగా ఉండే పదార్ధాల) ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణం తగ్గింది. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) డేటా ప్రకారం, సీపీఐ ఈ ఏడాది ఏప్రిల్లో 3.16 శాతంగా నమోదవ్వగా, కిందటేడాది మే నెలలో 4.8 శాతంగా ఉంది.
ఈ ఏడాది మే నెలలో ఆహార పదార్ధాల ధరల పెరుగుదలను కొలిచే ద్రవ్యోల్బణం 0.99 శాతంగా నమోదైంది. కిందటేడాది మే నెలలో రికార్డయిన 8.69 శాతంతో పోలిస్తే బాగా తగ్గింది. ఇది అక్టోబర్ 2023 నాటి తర్వాత నమోదైన అతి తక్కువ రేట్. పప్పులు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, ఇండ్లలో వాడుకునే వస్తువులు, సర్వీస్లు, బెల్లం, చక్కెర, గుడ్ల ధరలు భాగా తగ్గాయి.
దీనికి తోడు కిందటేడాది మే నెలలో ఆహార పదార్ధాల ద్రవ్యోల్బణం రేటు ఎక్కువగా ఉంది. దీంతో పోలిస్తే లోయర్ బేస్ వలన ఈ ఏడాది మేలో రేటు బాగా దిగొచ్చినట్టు కనిపిస్తోంది.