కామారెడ్డి, వెలుగు: పేరుకు తెలంగాణ ధనిక రాష్ట్రమని.. బడులు మాత్రం అధ్వానంగా ఉన్నాయని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి అన్నారు. రూ. 2 లక్షల కోట్ల స్టేట్బడ్జెట్లో విద్యకు కేటాయించేది కేవలం 5.8 శాతమేనని, ఇదీ ఖర్చు చేయడం లేదన్నారు. స్కూల్స్లో మౌలిక వసతుల లేవని, టీచర్లు లేరన్నారు. 40 లక్షల మంది స్టూడెంట్స్పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. సోషల్డెమోక్రటిక్ఫోరం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు కామారెడ్డి జిల్లాలో గవర్నమెంట్స్కూల్స్ను మురళి, ప్రొఫెసర్లక్ష్మీనారాయణ తదితరులు పరిశీలించారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రం దళితవాడలోని హైస్కూల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ తాము పరిశీలించిన చోట్ల స్కూల్స్లో క్లాస్రూమ్స్సరిగ్గా లేవన్నారు. రూమ్స్ఎప్పుడు పడిపోతాయో తెలియని పరిస్థితి ఉందని కూర్చునేందుకు బల్లలు కూడా సరిపడా లేవన్నారు. బ్లాక్బోర్డులు పాడయ్యాయని, వాటిపై రాస్తే స్టూడెంట్స్కు అర్థమయ్యే పరిస్థితి లేదన్నారు. తాగు నీటి వసతి కూడా సరిగ్గా లేదన్నారు. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని, శుభ్రం చేసేందుకు శానిటేషన్కార్మికులు కూడా లేరన్నారు. రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్స్కూల్స్ పరిస్థితి ఇలానే ఉందన్నారు. స్టేట్ గవర్నమెంట్స్కూల్స్పై అస్సలు ఫోకస్ చేయడం లేదన్నారు. ఢిల్లీ, ఏపీ, తమిళనాడు, కేరళ స్టేట్స్స్కూల్స్పై పెట్టుబడి పెట్టి పిల్లలు చదువుకునేందుకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయని అన్నారు.
ప్రజలు ప్రశ్నించాలె
స్కూల్స్పరిస్థితులపై ప్రజలు గవర్నమెంట్ను ప్రశ్నించాలి. డిమాండ్ చేయకపోతే గవర్నమెంట్మొద్దు నిద్ర పోతుందన్నారు. బంగారు తెలంగాణలో స్కూల్స్తోపాటు రోడ్లు, హాస్పిటల్స్పరిస్థితి కూడా అధ్వానంగా ఉందన్నారు.