హైదరాబాద్, వెలుగు : లండన్లో సీఎం రేవంత్ రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ భేటీ అయ్యారు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లండన్లోని థేమ్స్ నదిని అక్బరుద్దీన్తో కలిసి శుక్రవారం రేవంత్ పరిశీలించారు. థేమ్స్ నదిలాగే మూసీని అందంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేసేందుకుగానూ
పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీస్తో ఏర్పాటు చేసిన మీటింగ్లోనూ రేవంత్ పక్కన్నే అక్బరుద్దీన్ కూర్చున్నారు. రేవంత్తో కలిసి మీటింగ్లో పాల్గొన్న వీడియోను శనివారం అక్బరుద్దీన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.