లండన్​లో రేవంత్​, అక్బరుద్దీన్​ భేటీ

లండన్​లో రేవంత్​, అక్బరుద్దీన్​ భేటీ

హైదరాబాద్, వెలుగు : లండన్​లో సీఎం రేవంత్​ రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ ఒవైసీ భేటీ అయ్యారు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లండన్​లోని థేమ్స్​ నదిని అక్బరుద్దీన్​తో కలిసి శుక్రవారం రేవంత్ ​పరిశీలించారు. థేమ్స్​ నదిలాగే మూసీని అందంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేసేందుకుగానూ

పోర్ట్​ ఆఫ్​ లండన్​ అథారిటీస్​తో ఏర్పాటు చేసిన మీటింగ్​లోనూ రేవంత్​ పక్కన్నే అక్బరుద్దీన్​ కూర్చున్నారు. రేవంత్​తో కలిసి మీటింగ్​లో పాల్గొన్న వీడియోను శనివారం అక్బరుద్దీన్​ సోషల్ మీడియాలో పోస్ట్​ చేశారు.