హైదరాబాద్: కేటీఆర్ కు కాంగ్రెస్ అంటే ఎందుకంత భయమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పరిష్కారం చేయమనడం నేరమా అని ఆయన క్వశ్చన్ చేశారు. ‘కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేయకపోతే మీరు కాలు బయట పెట్టలేరా? జనం మధ్యకు రాలేరా? మీ దాగుడుమూతల పర్యటనలతో ప్రజలకు ఒరిగేదేమిటి’ అని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ను రేవంత్ ప్రశ్నించారు.
కేటీఆర్ గారూ… కాంగ్రెస్ అంటే ఎందుకంత భయం? సమస్యలు పరిష్కారం చేయమనడం నేరమా? మా నేతలను, కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేయకపోతే మీరు కాలుబయట పెట్టలేరా? జనం మధ్యకు రాలేరా? మీ దాగుడు మూతల పర్యటనలతో ప్రజలకు ఒరిగేదేమిటి? pic.twitter.com/pdXh0Wtpm1
— Revanth Reddy (@revanth_anumula) February 2, 2022
మరిన్ని వార్తల కోసం: