పార్టీ ఫిరాయించేటోళ్లను ఉరి తీయాలె : రేవంత్ రెడ్డి

పార్టీ ఫిరాయించేటోళ్లను ఉరి తీయాలె : రేవంత్ రెడ్డి

హత్యలు, లైంగిక దాడులకు అమలు చేసే కఠిన శిక్షలను పార్టీ ఫిరాయించిన వారికీ వర్తింపజేయాలని పీసీసీ ప్రెసిడెంట్​ రేవంత్​ రెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు  శుభాకాంక్షలను తెలిపారు. అనంతరం రేవంత్​ మాట్లాడారు. ఎమ్మెల్యే పార్టీ ఫిరాయిస్తే వారి సభ్యత్వం రద్దు చేయాలని  చెప్పారు. అవసరమైతే ఉరి తీసే విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పార్టీ ఫిరాయింపుల పట్ల కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని  తెలియజేశారు. ఈ అంశంపై రాజ్యాంగంలో సవరణ తీసుకు రావాల్సిన విషయాన్ని మేధావులు ఆలోచించాలని విన్నవించారు. ఇవాళ హాత్ సే హాత్ జోడో యాత్ర లాంఛనంగా ప్రారంభించినా ఫిబ్రవరి 6 నుంచి 60రోజులపాటు కొనసాగుతుందని చెప్పారు.